మధ్యప్రదేశ్ దామోహ్లో ఓ ఫేక్ డాక్టర్ ఏడుగురి ప్రాణాలను బలిగొన్నాడు. నరేంద్ర విక్రమాదిత్య యాదవ్ అనే వ్యక్తి ఫేక్ డాక్యుమెంట్లతో ప్రముఖ బ్రిటీష్ కార్డియాలజిస్ట్ అయిన N.జాన్ కెమ్ పేరు చెప్పుకుని ప్రైవేట్ మిషనరీ ఆస్పత్రిలో చేరాడు. కొంతమంది రోగులకు హార్ట్ ఆపరేషన్లు చేయగా అందులో ఏడుగురు కొన్ని రోజులకు మరణించారు. ఈ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటుందని పలువురు చెబుతున్నారు. దీనిపై అధికారులు విచారణ చేపట్టారు.
ఈ ఫేక్ డాక్టర్ బాధిత రోగుల సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. నరేంద్ర విక్రమాదిత్యని పోలీసులు అరెస్ట్ చేసి దీనిపై అధికారులు విచారణ చేపట్టారు. అతని మెడికల్ ప్రాక్టీస్ సర్టిఫికేట్ గురించి ఆరాతీస్తున్నారు. మానవ హక్కుల సంఘాలు, న్యాయవాది ఈ విషయంపై మెజిస్ట్రేట్కు ఫిర్యాదు చేశారు.జిల్లా దర్యాప్తు బృందం ఆసుపత్రి నుండి అన్ని పత్రాలను స్వాధీనం చేసుకుంది. దర్యాప్తులో ఆ నకిలీ వ్యక్తి ప్రముఖ బ్రిటిష్ వైద్యుడి మాదిరిగానే నకిలీ పత్రాలను దాఖలు చేసినట్లు వెల్లడైంది. నిందితుడు హైదరాబాద్లో నమోదైన క్రిమినల్ కేసుతో సహా అనేక వివాదాల్లో పాల్గొన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.