Hyderabad : గాంధీ విగ్రహం ధ్వంసం

Update: 2024-11-05 08:45 GMT

హైదరాబాద్ నిజాంపేట్‌లో గాంధీ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఈ సంఘటన స్థానికంగా సంచలనం రేపింది. ప్రగతినగర్‌ ఆరవ డివిజన్‌లో అర్థరాత్రి గుర్తు తెలియని దుండగులు ఈ దారుణానికి పాల్పడ్డారు. ఘటనా స్థలంలో ఉన్న ఆధారాలతో మద్యం మత్తులోనే ఆకతాయిలు ఈ దారుణానికి పాల్పడినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై గాంధీ అభిమానులు, కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తులు ఎవరైనా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. విగ్రహం ధ్వంసమైన సమాచారం అందుకున్న బాచుపల్లి పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Tags:    

Similar News