Sangareddy: సంగారెడ్డి జిల్లాలో దారుణ హత్య.. తల, మొండెం వేరు చేసి..
Sangareddy: సంగారెడ్డి జిల్లాలో వ్యక్తి తల మొండెం వేరు చేసిన ఘటన కలకలం రేపింది.
Sangareddy: సంగారెడ్డి జిల్లాలో వ్యక్తి తల మొండెం వేరు చేసిన ఘటన కలకలం రేపింది. రాయికోడ్ పీఎస్ పరిధిలోని కుకునూర్ గ్రామం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు ఓవ్యక్తి తల, మొండెం వేరు చేసి ఉంచారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టగా.. మృతుడు వెలిమల తండాకు చెందిన కడవత్ రాజుగా గుర్తించారు. కాగా ఈనెల 26 వతేదిన BDL భానుర్ పీఎస్లో రాజు కనిపించడం లేదని కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా మిస్సింగ్ కేసు నమోదు చేశారు. కడవత్ రాజు హత్యకు రియల్ ఎస్టేట్ వ్యాపార లావాదేవీలు కారణమని పోలీసులు భావిస్తున్నారు.