బాలీవుడ్ నటుడు, కమెడియన్ కపిల్ శర్మను చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. గుర్తు తెలియని వ్యక్తులు కపిల్ శర్మను హత్య చేస్తామంటూ ఈమెయిల్స్ పంపించారు. మరో బాలీవుడ్ నటుడు రాజ్ పాల్ యాదవ్, కొరియోగ్రాఫర్ మో డిసౌజాకు కూడా ఈ బెదిరింపు కాల్స్ వచ్చినట్లు తెలుస్తోంది. బెదిరింపు ఈమెయి ల్స్ పాకిస్తాన్ నుంచి వచ్చినట్లు పోలీసుల ప్రాథమిక విచారణ తేలింది. కపిల్ శర్మ తోపాటు వారి కుటుంబ సభ్యులు, సన్నిహితుల లక్ష్యంగా కూడా వచ్చాయని తెలుస్తోంది. రాజా పాల్ యాదవ్ భార్య చేసిన ఫిర్యాదు మేరకు అంబోలి పోలీసులు గుర్తు తెలియని వ్యక్తిపై BNS సెక్షన్ 351(3) కింద ఎఫ్ఎస్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బెదిరింపు ఇమెయిల్లు పాకిస్తాన్ నుంచి వచ్చాయని ప్రాథమిక పరిశోధనలు తెలు స్తోంది. don99284@gmail.com ఇమెయిల్ చిరునామా ద్వారా ఇమెయిల్ సంతకంలో తమను తాము "విష్ణు"గా చెప్పుకుంటూ పంపించారు. పోలీసులు కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు. గత కొంత కాలంగా బాలీవుడ్ నటులకు బెదిరింపులు వస్తున్నాయి. గత ఏడాది చివరలో సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్ కు బెదిరిం పులు వచ్చిన విషయం తెలిసిందే. ఇటీవలే సైఫ్ అలీఖాన్ పై ఏకంగా దాడే జరిగింది. ఆరు రోజుల క్రితం ఆస్పత్రి నుంచి డిశ్చార్జయ్యారు సైఫ్.