Haryana: రెచ్చిపోయిన మైనింగ్ మాఫియా.. రైడింగ్కు వెళ్లిన డీఎస్పీని హత్య..
Haryana: మైనింగ్ మాఫియా రెచ్చిపోయింది. రైడింగ్కు వెళ్లిన తావడు డీఎస్పీ సురేంద్రసింగ్ను దుండగులు దారుణంగా హత్యచేశారు.
Haryana: హర్యానాలో మైనింగ్ మాఫియా రెచ్చిపోయింది. రైడింగ్కు వెళ్లిన తావడు డీఎస్పీ సురేంద్రసింగ్ను దుండగులు దారుణంగా హత్యచేశారు. నూహ్లో అక్రమంగా మైనింగ్ జరుగుతుందనే పక్కా సమాచారంతో డీఎస్పీ రైడింగ్ కు వెళ్లారు. దీంతో ఆయనను మాఫియా గ్యాంగ్ ట్రక్కుతో తొక్కించి కిరాతకంగా చంపేసింది. డంపర్ డ్రైవర్ కావాలనే డీఎస్పీ పైనుంచి ట్రక్కును పోనిచ్చినట్లు నూహ్ పోలీసులు తెలిపారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.