Shocking Video: దారుణం..15 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి.. రోడ్డుపై నగ్నంగా నడిపించి..

Shocking Video: అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్.. అత్యాచారాలు, అన్యాయాలకు రాష్ట్రంలో కొదవలేదు. దుర్మార్గులకు కఠినమైన శిక్షలు పడకపోవడమే ఇలాంటి అన్యాయాలు జరగడానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు.

Update: 2022-09-23 06:45 GMT

Shocking Video: అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్.. అత్యాచారాలు, అన్యాయాలకు రాష్ట్రంలో కొదవలేదు. దుర్మార్గులకు కఠినమైన శిక్షలు పడకపోవడమే ఇలాంటి అన్యాయాలు జరగడానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు.

UP మొరాదాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. 15 ఏళ్ల బాలికపై ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసి, రోడ్డుపై నగ్నంగా నడిచేలా చేశారని జాతీయ మీడియా నివేదించింది. ఈ ఘటన జరిగిన 15 రోజుల తర్వాత వీడియో బయటకు రావడంతో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. 30 సెకన్ల నిడివి గల వీడియోలో బాలిక రోడ్డుపై నగ్నంగా నడుస్తూ కనిపించింది. విపరీతంగా రక్తస్రావం అవుతుండగా బాలిక రోడ్డుపై నగ్నంగా సుమారు 2 కిలోమీటర్లు నడిచిందని కుటుంబసభ్యులు పోలీసులకు తెలిపారు.

బాలిక 15 ఏళ్ల చిన్నారి. అత్యాచారం తర్వాత పూర్తిగా షాక్‌కు గురైంది. ఆమె ఆ షాక్‌లోనే తన ఇంటికి నగ్నంగా నడుచుకుంటూ వెళ్లింది. నిందితులు ఆమె శరీరంపై బట్టలు కూడా వదల్లేదు. వాటిని కూడా చించేశారు. పరమ రాక్షసులుగా ప్రవర్తించారు. నిందితులు బాలికను నగ్నంగా చేసి కారులో నుంచి తోసేశారు. నిస్సహాయ స్థితిలో ఉన్న బాలిక బాధలో రోడ్డుపై నగ్నంగా నడిచింది.

బాటసారులు బాధితురాలికి సహాయం చేయడానికి బదులు మూగ ప్రేక్షకులుగా మారిపోయారు. మానవత్వం మరిచి అదేదో సుందర దృశ్యం అన్నట్లు చిత్రీకరించడం ప్రారంభించారు. పైశాచిక ఆనందంతో ఆ వీడియోలను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో షేర్ చేశారు.

బాలిక మేనమామ కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. సెప్టెంబర్ 7న ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత పోలీసులు నిందితులను పట్టుకున్నారు. దీంతో ఆగ్రహించిన నిందితులు బాలికను, ఆమె కుటుంబాన్ని చంపేస్తామని బెదిరిస్తున్నారు.

Tags:    

Similar News