మైనర్ బాలికకు అబార్షన్ చేసిన తల్లి, మంత్రసాని.. బాలిక మృతి
ఓ తల్లి మూర్ఖత్వానికి బాలిక బలైంది.;
ప్రభుత్వాలు ఎంత అవగాహన కల్పిస్తున్నా.. కొందరిలో మాత్రం మార్పు రావడం లేదు. ఓ తల్లి మూర్ఖత్వానికి బాలిక బలైంది. ఈ దారుణం జగిత్యాల జిల్లా ధర్మపురిలో చోటు చేసుకుంది. గర్భం దాల్చిన మైనర్కు.. ఆమె తల్లి అబార్షన్ చేసే ప్రయత్నం చేసింది. దీంతో వైద్యం వికటించి బాలిక, శిశువు మృతి చెందారు. గుట్టు చప్పుడు కాకుండా మృతదేహాలను పూడ్చింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న పోలీసులు.. రంగంలోకి దిగి కేసు దర్యాప్తు ప్రారంభించారు. పూడ్చిన మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం కోసం పంపించారు.