Adilabad : నిర్మల్లో హత్యకు దారి తీసిన ప్రేమ వ్యవహారం
Adilabad : నిర్మల్లో ప్రేమ వ్యవహారం ఓ యువకుడి హత్యకు దారి తీసింది.
Adilabad : నిర్మల్లో ప్రేమ వ్యవహారం ఓ యువకుడి హత్యకు దారి తీసింది. లోకేశ్వరం మండలం గడ్చంద గ్రామానికి చెందిన ప్రసాద్ అనే యువకుడు స్థానిక మహాలక్ష్మీ ఆసుపత్రిలో కాంపౌండర్గా పనిచేస్తున్నాడు. ప్రసాద్కు కొన్ని రోజులుగా ఓ యువతితో పరిచయం ఏర్పడింది. అయితే అదే యువతిని మరో వ్యక్తి సైతం ప్రేమిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో.. ఇద్దరి మధ్య ఘర్షణ జరిగిందని......ఈ ఘటనలో ప్రసాద్ తీవ్రంగా గాయపడటంతో అతను చనిపోయినట్లు అతని మిత్రులు తెలిపారు. మృతదేహాన్ని నిర్మల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు.