సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తిని దుండగులు సజీవ దహనం చేశారు. నోట్లో గుడ్డలు కుక్కి... బొల్లారం రింగ్ రోడ్డు దగ్గర తగులబెట్టారు. మంటల్లో కాలుతున్న వ్యక్తిని చూసిన స్థానికులు... ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఎక్కడో హత్య చేసి తీసుకోచ్చి బొల్లారం రింగ్ రోడ్ సమీపంలో దహనం చేసినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.