ఎలాంటి అనుమతులు లేకుండా రూ.4 లక్షల 37 వేల విలువైన టపాసులు నిల్వ ఉంచగా వాటిని పోలీసులు సీజ్ చేశారు. పట్టణంలోని చొక్కారపు యాదగిరి అనే వ్యాపారి దుకాణంలో అనుమతి లేకుండా టపాసులు నిల్వ ఉంచారని వచ్చిన సమాచారం మేరకు పోలీసులు తనిఖీ చేశారు. అనుమతి లేకుండా రూ.4.37 లక్షల విలువైన క్రాకర్స్, టపాసులు దొరికినట్లు టౌన్ సీఐ తిరుమల గౌడ్ తెలిపారు. హుజురాబాద్ పట్టణంతో పాటు మండలంలోని ఏ గ్రామంలోనైనా అనుమతులు లేకుండా క్రాకర్స్, టపాసులు నిల్వ ఉంచితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.