Theft : మిర్చీ లోడ్ మనీ దొంగిలించిన లారీ క్లీనర్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

Update: 2024-08-23 06:15 GMT

మిర్చి అమ్మిన సొమ్మును దొంగలించిన క్లీనర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 18లక్షల 52వేల రూపాయలను రికవరీ చేశారు. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా నందిగామలో సంచలనం రేపింది.

మధిర నుంచి చత్తీస్‌గఢ్‌కు మిర్చి లోడు అమ్మగా వచ్చిన డబ్బును క్లీనర్‌ కోటేశ్వరరావు చోరీ చేశాడు. పాల్వంచ వద్ద కడుపునొప్పిగా ఉందని డ్రైవర్‌ ఖయ్యుమ్ కు చెప్పి దిగిపోయాడు.. జొన్నలగడ్డ వద్దకు రాగానే డబ్బులు లేవని గ్రహించిన ఖయ్యం నందిగామ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వెంటనే కోటేశ్వరరావు సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ను ట్రాక్ చేసిన పోలీసులు ముద్దాయిని అదుపులోకి తీసుకున్నారు... అతని నుంచి 18 లక్షల 52 వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు.

Tags:    

Similar News