యాదగిరి గుట్ట ఎమ్మార్వో వసూళ్ల పర్వం
రైతుల నుంచి స్వయంగా ఎమ్మార్వో డబ్బులు డిమాండ్ చేయడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది;
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరి గుట్ట ఎమ్మార్వో ఆఫీస్లో వసూళ్ల పర్వం కొనసాగుతుంది. రైతుల నుంచి స్వయంగా ఎమ్మార్వో డబ్బులు డిమాండ్ చేయడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. రైతుల నుంచి ఎమ్మార్వో డిమాండ్ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఇద్దరు వ్యక్తులు చెరో అర ఎకర కొనుగోలు చేసి. పట్టాదారు పాస్ బుక్ల కోసం సంప్రదిస్తే 5 వేలు ఇస్తేనే పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తామన్నారు ఎమ్మార్వో. అయితే డాక్యుమెంట్స్ అన్నీ సరిగ్గా ఉన్నాయని చెప్పినా తనకు ప్రోటోకాల్ ఉందని.. డబ్బులు ఇవ్వాల్సిందేనని అంటున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.