శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఐదోరోజున అమ్మవారు శ్రీ సరస్వతీదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారి జన్మనక్షత్రమైన మూలానక్షత్రం కావడంతో.. మహంకాళీ, మహాలక్ష్మీ, మహాసరస్వతి స్వరూపాలతో దుష్టసంహారం చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి. సకల విద్యలకు ఆదిదేవతగా ఉన్న సరస్వతి దేవిని దర్శించుకుని అనుగ్రహం పొందేందుకు తెల్లవారుజాము మూడు గంటల నుండే భక్తులు పెద్ద సంఖ్యలో ఇంద్రకీలాద్రికి తరలివస్తున్నారు.