Miss World Finalists : హెడ్ టు హెడ్ చాలెంజ్లో 20 మంది కంటెస్టెంట్స్

Update: 2025-05-23 13:15 GMT

72వ మిస్ వరల్డ్ పోటీల్లో తాజాగా మరో కీలక దశను చేరుకుంది. నిన్న తొలిరౌండ్ విజయవంతమైంది. తర్వాత, హెట్టుహెడ్ చాలెంజ్కు ఎంపికైన టాప్ 20 ఫైనలిస్టుల జాబితాను తాజాగా ప్రకటించారు. 107 మంది పోటీ దారులు ఈ పోటీలో పాల్గొన్నారు. వారు తమ వ్యక్తిత్వాన్ని, సామాజిక స్పృహను ప్రదర్శిస్తూ, మానసిక ఆరోగ్యం, మహిళల సాధికారత, విద్య, పర్యావరణ సంరక్షణ, సాంస్కృతిక పరిరక్షణ వంటి కీలక విషయాలపై ఆత్మవిశ్వాసంగా ప్రసంగించారు. ఈ మాటల పోరులో ప్రతిభ, ఆలోచనల స్పష్టత, సమాజం పట్ల ఉన్న బాధ్యతను దృష్టిలో పెట్టుకుని బెస్ట్ 20 మంది ఎంపికయ్యారు. ఇందులో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న నందిని గుప్తాకు అవకాశం దక్కలేదు. ఇవాళ జరిగే తుది రౌండ్ , ఎంపికైన 20 మంది ఫైనలిస్టులకు మరోసారి తమ సామాజిక దృక్పథాన్ని ప్రదర్శించే అవకాశం లభించనుంది. విజేతను ఎంపిక చేయడంలో అభిప్రాయాలు స్పష్టత, సామాజిక బాధ్యతపై ఉన్న నిబద్ధత, వ్యక్తిగత అంకితభావం కీలక ప్రమాణాలుగా ఉపయోగించనున్నారు.

Tags:    

Similar News