రూ.5 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తాం: సల్మాన్ ను మరోసారి బెదిరించిన బిష్ణోయ్ గ్యాంగ్
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుండి నటుడు సల్మాన్ ఖాన్ ను చంపేస్తామని బెదిరిస్తూ మరోసారి ముంబై పోలీసులకు సందేశం వచ్చింది.;
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుండి నటుడు సల్మాన్ ఖాన్పై ముంబై పోలీసులకు బెదిరింపు సందేశం వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఆ సందేశంలో చేసిన తప్పుకు క్షమాపణ చెప్పండి లేదా సజీవంగా ఉండటానికి రూ. 5 కోట్లు చెల్లించండి అని అందులోని సమాచారం. ముంబై పోలీస్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్కు గత రాత్రి వాట్సాప్లో గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పేరుతో బెదిరింపు సందేశం వచ్చింది.
సల్మాన్ ఖాన్ కు బ్రతుకు మీద ఆశ ఉంటే "మా గుడికి వెళ్లి క్షమాపణ చెప్పాలి లేదా రూ. 5 కోట్లు ఇవ్వాలి" అని సందేశం పంపించారు. అలా చేయకుంటే చంపేస్తాం, మా గ్యాంగ్ ఇంకా యాక్టివ్గా ఉంది’’ అని లారెన్స్ బిష్ణోయ్ సోదరుడి పేరు మీద మెసేజ్ ఉంది. సోమవారం మెసేజ్ వచ్చిందని, విచారణ ప్రారంభించామని పోలీసులు తెలిపారు. వర్లీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు ప్రక్రియ కొనసాగుతోందని, మెసేజ్ వచ్చిన ఫోన్ నంబర్ను ట్రాక్ చేస్తున్నామని ముంబై పోలీసులు తెలిపారు.
వారం వ్యవధిలో సల్మాన్ఖాన్కు ఇది రెండో హత్య బెదిరింపు . ముంబై పోలీస్ ట్రాఫిక్ కంట్రోల్కి అంతకు ముందు వచ్చిన మరణ బెదిరింపులో , నటుడి నుండి రూ. 2 కోట్ల ధనం డిమాండ్ చేయబడింది. గుర్తు తెలియని వ్యక్తి సల్మాన్ను తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటావని బెదిరించినట్లు పోలీసులు తెలిపారు.
ట్రాఫిక్ పోలీసులు ఈ విషయాన్ని వర్లీ పోలీసులకు నివేదించారు, వారు ఈ విషయంలో నేరం నమోదు చేసి పంపినవారిని ట్రాక్ చేయడం ప్రారంభించారు. బెదిరింపు సందేశాన్ని స్వీకరించిన తర్వాత, ముంబైలోని వర్లీ పోలీస్ స్టేషన్లో గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదైంది.
అంతకుముందు అక్టోబర్ 24న గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పేరుతో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ను బెదిరించి రూ.5 కోట్ల విమోచనం డిమాండ్ చేసిన జంషెడ్పూర్కు చెందిన వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. అంతకుముందు అక్టోబర్ 18న ఖాన్ను బెదిరిస్తూ సందేశం పంపిన వ్యక్తిని అరెస్ట్ చేయడంతో, ఆ సందేశం "పొరపాటున పంపబడింది" అని క్షమాపణలు తెలిపాడు.
ఇటీవల ఎన్సిపి నాయకుడు బాబా సిద్ధిక్ హత్య నేపథ్యంలో ఈ సంఘటన జరిగింది.
మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖ్ను అక్టోబర్ 12న ముంబైలోని నిర్మల్ నగర్ ప్రాంతంలో ఆయన కుమారుడు, ఎమ్మెల్యే జీషన్ సిద్ధిక్ కార్యాలయం సమీపంలో ముగ్గురు దుండగులు కాల్చిచంపారు