బీసీలను ఉద్దరిస్తామని కాంగ్రెస్ చేస్తున్న హడావుడిని తీవ్రంగా తప్పుబట్టారు ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్... 75 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో బీసీలు అణచివేతకు గురయ్యారన్నారు. 60శాతం ఉన్న బీసీలకు కాకుండా ఐదు శాతం ఉన్న సామాజిక వర్గానికే ముఖ్యమంత్రి పదవి దక్కడంలోనే కాంగ్రెస్ తీరు తెలుస్తోందన్నారు. పదిమంది ఎమ్మెల్యేలపై అనర్హత వేయాలన్న తన డిమాండ్ను కోర్టులు త్వరగా తేల్చాలన్నారు. ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశానికి తనను అనుమతించకపోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.