Assam Road Accident: పూజకు వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో పది మంది దుర్మరణం..

Assam Road Accident: రోజురోజుకీ రోడ్డు ప్రమాదాల వల్ల మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది.

Update: 2021-11-11 07:09 GMT

Assam Road Accident (tv5news.in)

Assam Road Accident: రోజురోజుకీ రోడ్డు ప్రమాదాల వల్ల మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా అస్సాంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏకంగా 10 మంది మృత్యువాత పడ్డారు. ఈ ఘటన కరీంగంజ్‌ జిల్లా బైథగల్ ప్రాంతంలో చోటుచేసుకుంది.

ఛఠ్‌ పూజ కొసం ఆటోలో పది మంది బయలుదేరారు. ఆటో బైథగల్ ప్రాంతం చేరుకోగానే వేగంగా వచ్చిన ట్రక్ ఆటోను ఢీ కొట్టింది. ఎదురుగా వచ్చి ఢీ కొట్టడంతో ఆటోలో ఉన్నవారు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు అక్కడికి చేరుకునేలోపు అందరూ మృత్యువాత పడ్డారు. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ మృతులకు సంతాపం తెలియజేశారు. ఆటోను ఢీకొట్టి ఇంతమంది మృతికి కారణమయిన ట్రక్ డ్రైవర్ పరారీలో ఉన్నాడని.. అస్సాం పోలీసులు అతనిని పట్టుకునే ప్రయత్నం చేస్తు్న్నారని సీఎం తెలియజేశారు.

Tags:    

Similar News