Congress MP Santokh Singh : భారత్ జోడో యాత్రలో విషాదం.. కాంగ్రెస్ ఎంపీ కన్నుమూత

Congress MP Santokh Singh : రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఎంతో ఉత్సాహంగా సాగుతోంది.. కానీ ఈ రోజు ఉదయం ఓ విషాదం చోటు చేసుకుంది. కాంగ్రెస్ ఎంపీ సంతోక్ సింగ్ మృతి చెందారు.

Update: 2023-01-14 06:18 GMT

Congress MP Santokh Singh : రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఎంతో ఉత్సాహంగా సాగుతోంది.. కానీ ఈ రోజు ఉదయం ఓ విషాదం చోటు చేసుకుంది. కాంగ్రెస్ ఎంపీ సంతోక్ సింగ్ మృతి చెందారు. పంజాబ్‌లోని ఫిలింనగర్‌లో శనివారం భారత్ జోడో యాత్రలో పాల్గొన్న కాంగ్రెస్ ఎంపీ చౌదరి సంతోక్ సింగ్ గుండెపోటుతో మరణించారు.


జలంధర్‌కు చెందిన కాంగ్రెస్ ఎంపీ చౌదరి సంతోక్ సింగ్ పంజాబ్‌లోని ఫిలింనగర్‌లో శనివారం ఉదయం భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. రాహుల్‌తో పాటు నడుస్తున్న ఆయనకు ఒక్కసారిగా గుండె వేగంగా కొట్టుకుంటున్నట్లు అనిపించింది. ఉన్నపళంగా అక్కడే కుప్పకూలిపోయారు.. దీంతో రాహుల్ అతడని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.


ఫగ్వారాలోని విర్క్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. సమాచారం అందుకున్న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను ఈరోజు నిలిపివేశారు. కాగా, భారత్ జోడో యాత్ర గత ఏడాది సెప్టెంబర్ 7న కన్యాకుమారి నుంచి ప్రారంభమై జనవరి 30న జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ముగుస్తుంది.



పంజాబీలో కాంగ్రెస్ ఎంపీ మృతి పట్ల పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ట్విట్టర్‌లో సంతాపం తెలిపారు. "జలంధర్‌కు చెందిన కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు సంతోక్ సింగ్ చౌదరి అకాల మరణం నన్ను కలిచి వేసింది. అతని ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను" అని రాశారు.


పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ కూడా తన సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టారు. కాంగ్రెస్ ఎంపీ సంతోఖ్ సింగ్ చౌదరి మృతి పట్ల లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సంతాపం తెలిపారు. తాజా సమాచారం ప్రకారం సంతోక్ సింగ్ చౌదరి అంత్యక్రియలను రేపు (ఆదివారం) ఆయన గ్రామంలో నిర్వహించనున్నారు.

Tags:    

Similar News