దేశంలో కరోనా స్వైరవిహారం.. కొత్తగా 96,551 కేసులు
దేశంలో కరోనా మహమ్మారి స్వైరవిహారం చేస్తుంది. ఇటీవల లక్షకు చేరువలో కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో;
దేశంలో కరోనా మహమ్మారి స్వైరవిహారం చేస్తుంది. ఇటీవల లక్షకు చేరువలో కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 96,551 మంది కరోనా బారినపడ్డారు. దీంతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 45,62,415లకు చేరాయి. ఇందులో ఇప్పటివరకూ 35,42,664 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇంకా 9,43,480 మంది చికిత్స పొందుతున్నారు. తాజాగా కరోనాతో 1209 మంది మృతి చెందారు. ఇప్పటి దేశవ్యాప్తంగా కరోనాతో 76,271 మంది చనిపోయారు. కాగా..ఇప్పటివరకూ 5,40,97,975 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్మార్) ప్రకటించింది.