Delhi: కంజ్వాలా ఘటన ఒక్కటే కాదు.. ఇంకోటి జరిగింది
ఫుడ్ డెలివరీ బాయ్ బైక్ను ఢీకొట్టీ కిలోమీటర్ ఈడ్చుకెళ్లిన కారు: సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు;
ఢిల్లీ కంజ్వాలా సంఘటన జరిగిన రోజే నోయిడాలో ఇంచుమించు అలాంటీ సంఘటనే మరొకటి చోటు చేసుకుంది. గత ఆదివారం స్విగ్గీ డెలివరీ బాయ్గా పనిచేస్తున్న కౌషల్ యాదవ్ అనే వ్యక్తి అదే రీతిన మృత్యువాత పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఉత్తరప్రదేశ్లోని మణిపుర్ కు చెందిన కౌశల్ యాదవ్ న్యూఇయర్ రోజు రాత్రి 1 గంట ప్రాంతంలో నోయిడాలోని 14వ సెక్టార్ ఫ్లైఓవర్పై వెళుతుండగా కారు ఢీ కొట్టింది. ఆ సమయంలో అతని బైక్ కారుతో పాటు దాదాపు 1 కిలోమీటర్ మేర ఈడ్చుకెళ్లింది. ఈ సంఘటనలో కౌషల్ మృతి చెందాడు.
కొంత సమయం తరువాత అతని కుటుంబ సభ్యులు ఫోన్ చేయగా ఓ క్యాబ్ డ్రైవర్ అతని ఫోన్ ఎత్తి కౌషల్కు యాక్సిడెంట్ అయిందని చెప్పాడు. దీంతో అతని కుటుంబ సభ్యులు 1వ ఫేజ్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. కౌషల్ ఫోన్ ఆన్సర్ చేసిన క్యాబ్డ్రైవర్ను కూడా ప్రశ్నిస్తున్నారు.