India corona : తగ్గిన కేసులు... పెరిగిన మరణాలు..!

India corona : గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 17,59,434 టెస్టులు చేయగా కొత్తగా 2,35,532 తాజా కోవిడ్ కేసులు నమోదయ్యాయి.

Update: 2022-01-29 04:14 GMT

India corona : దేశవ్యాప్తంగా కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 17,59,434 టెస్టులు చేయగా కొత్తగా 2,35,532 తాజా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే 6.2 శాతం తక్కువ కేసులు నమోదయ్యాయి. అయితే మరణాలు పెరిగాయి. దేశంలో కరోనాతో 871 మంది కరోనాతో మృతి చెందారు. నిన్న 627మంది మృతి చెందారు. దీనితో మొత్తం మరణాల సంఖ్య 4,93,198కి చేరుకుంది. ఇక తాజాగా కరోనా నుంచి 3,35,939 కొలుకున్నారు. ఇక ప్రస్తుతం దేశంలో 20,04,333 యాక్టివ్ కేసులున్నాయి. అత్యధికంగా కేరళలో 54,537 కేసులు నమోదయ్యాయి. 31,198 కేసులతో కర్ణాటక, 26,533 కేసులతో తమిళనాడు, 24,948 కేసులతో మహారాష్ట్ర, 12,561 కేసులతో ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. ఈ ఐదు రాష్ట్రాల నుండి 63.59 శాతం కొత్త కేసులు నమోదయ్యాయి

Tags:    

Similar News