తెలంగాణ టెట్ నోటిఫికేషన్ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. ఈ నెల 5 నుంచి 20వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించేందుకు అవకాశం ఉంది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి 20 వరకు ఆన్లైన్లో పరీక్షలు నిర్వహిస్తారు. పేపర్-1కు డీఈడీ, పేపర్-2కు బీఈడీ పూర్తి చేసిన అర్హులు. స్కూలు అసిస్టెంట్గా ప్రమోషన్ పొందేందుకు టెట్ అర్హత తప్పనిసరి కావడంతో టీచర్లు పనిచేస్తున్న వారు సైతం దరఖాస్తు చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
టెట్ పేపర్-1కు డీఈడీ, పేపర్-2కు బీఈడీ పూర్తి చేసిన వారు అర్హులు. స్కూల్ అసిస్టెంట్గా పదోన్నతి పొందేందుకు టెట్ అర్హత ఉండాలని చెబుతుండటంతో వేల మంది ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు కూడా పరీక్షకు హాజరుకానున్నారు. టెట్ ప్రవేశపెట్టిన నాటి నుంచి ఇప్పటివరకు తొమ్మిది సార్లు పరీక్షలు నిర్వహించగా...జనవరిలో పదోసారి జరగనుంది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత గత మే పరీక్షతో కలుపుకొని ఆరుసార్లు పరీక్షలు జరిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే రెండోసారి టెట్ను నిర్వహిస్తుండటం విశేషం.