దేశంలో కరోనా క్రమంగా వి స్తరిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తం గా 498 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే విధంగా కరోనాతో ఒక్క రోజులో నలుగురు మృతి చెందారు. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడిం చిన వివరాల ప్రకారం దేశ వ్యాప్తంగా ప్రస్తుతం 5,364యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా ఇప్పటి వరకు కోవిడ్ కారణంగా మొత్తం 55 మరణాలు సంభవించినట్లు అధికారులు తెలిపారు. కేరళ, పంజాబ్, కర్ణాటక రాష్ట్రాల్లో తాజాగా మరణాలు చోటు చేసుకున్నాయి. గడిచిన 24 గంటల్లో పంజాబ్, కర్ణాటక రాష్ట్రాల్లో ఒక్కొక్కర చొప్పున ఈ వైరస్ కారణంగా మృతి చెందగా, కేరళలో ఇద్దరు చనిపోయారు. అత్యధికంగా కేసులు నమోదవుతున్న కేరళలో తాజాగా ఒక్క రోజులోనే మరో 192 కొత్త కేసులు నమోద య్యాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ క్రమంగా వైరస్ విస్తరిస్తోంది. ఏపీలో నిన్నటి నుంచి కొత్తగా 12 మందిలో వైరస్ ఉన్నట్లు గుర్తించారు. అదే విధంగా తెలంగాణలో 2 కొత్త కేసులు నమో దయ్యాయి. గుజరాత్లోనూ నిన్నటి నుంచి భారీగా కొత్త కేసులు నమోదయ్యాయి. ఆ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 107 మందికి వైరస్ సోకినట్లు పరీక్షల్లో నిర్థారణ అయింది. పశ్చిమ బెంగాల్లో 58, మహారాష్ట్రలో 22, కర్ణాటక, హర్యానా రాష్ట్రాల్లో 15 చొప్పున కొత్త కేసులు నమోదయ్యాయి. ఈశాన్య రాష్ట్రాలైన అరుణా చల్ ప్రదేశ్, మిజోరంలలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు లేవని కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కలు వెల్లడిస్తున్నాయి.