Delhi CM : జైలులో కేజ్రీవాల్ డైలీ ఏం చేస్తారంటే.?

Update: 2024-04-02 04:52 GMT

లిక్కర్ స్కాం కేసులో నిన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు (Arvind Kejriwal) ఏప్రిల్ 15 వరకు జ్యూడీషియల్ రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. అయితే కేజ్రీవాల్ జైలులో ఏం చేస్తారని అందరు అనుకుంటారు. తీహార్​ జైలులో ఇతర ఖైదీలతోపాటే కేజ్రీవాల్​ దిన చర్య స్టార్ట్ అవుతుంది.

కేజ్రీవాల్ దినచర్య

డైలీ మార్నింగ్ 6.30 గంటలకు నిద్ర లేస్తారు. టీ, బ్రెడ్​ అల్పాహారంగా ఇస్తారు. స్నానం తర్వాత విచారణ ఉంటే కోర్టుకు లేకుంటే తన లాయర్లతో మీటింగ్​లో పాల్గొంటారు.

ఉదయం 10.30–11.00 గంటల మధ్య పప్పు, ఓ కూరతోపాటు అన్నం లేదా 5 రోటీలతో భోజనం అందించనున్నారు.

మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయన తన సెల్​లోనే ఉంటారు.

3.30 గంటలకు కప్పు టీ, రెండు బిస్కెట్లు తీసుకుంటారు.

సాయంత్రం 4 గంటలకు మళ్లీ తన లాయర్లకు కలుసుకునే అవకాశం ఉంటుంది.

సాయంత్రం 5.30 గంటలకు డిన్నర్​ చేసి, మళ్లీ రాత్రి 7 గంటలకు తన సెల్​లోకి వెళతారు.

వార్తలు, వినోదం, క్రీడలతో సహా 18 నుంచి 20 చానళ్లు చూసేందుకు అనుమతి ఇచ్చారు.

కేజ్రీవాల్​కు 24 గంటలు వైద్యులు అందుబాటులో ఉంటారు.

Tags:    

Similar News