పంజాబ్కు (Punjab) ఎనిమిది మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రకటించింది. ఐదుగురు కేబినెట్ మంత్రులకు స్థానం కల్పించింది. అమృత్సర్ నుంచి కుల్దీప్ సింగ్ ధాలివాల్, ఖదూర్ సాహిబ్ నుంచి లాల్జీత్ సింగ్ భుల్లార్, జలంధర్ నుంచి సుశీల్ కుమార్ రింకూ, ఫతేఘర్ సాహిబ్ నుంచి గుర్ప్రీత్ సింగ్ జీపీ, సంగ్రూర్ నుంచి గుర్మీత్ సింగ్ మీట్ హయర్, ఫరీద్కోట్ నుంచి కరమ్జిత్ అన్మోల్, బద్దియన్ నుంచి కరమ్జిత్ ఖుర్దియన్ అభ్యర్థులుగా ఆప్ పోటీ చేసింది.
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పంజాబ్లోని మొత్తం 13 లోక్సభ స్థానాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని అరవింద్ కేజ్రీవాల్ ఫిబ్రవరిలో ప్రకటించారు. కేంద్రంలో బీజేపీని ఓడించాలనే లక్ష్యంతో ఉన్న ఆప్ ఇండియా కూటమికి కేజ్రీవాల్ ప్రకటన పెద్ద దెబ్బ. కాంగ్రెస్, ఆప్ ప్రతిపక్ష కూటమిలో ఒక భాగం.