BJP : బీజేపీకి మరో షాక్.. రాజకీయాలకు మాజీ సీఎం గుడ్‌బై

Update: 2024-03-21 09:51 GMT

ఎన్నికల వేళ బీజేపీలో (BJP) అసంతృప్తులు వ్యక్తమవుతున్నాయి. తాజాగా కర్ణాటక మాజీ సీఎం, ఎంపీ సదానంద గౌడ (Sadananda Gowda) ఆ పార్టీకి షాక్ ఇచ్చారు. బెంగళూరు నార్త్ సీటు ఇవ్వకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీలో చేరనని, మోదీనే మళ్లీ ప్రధాని కావాలని కోరుకుంటున్నానని అన్నారు. కాగా ఇటీవల RLJP చీఫ్ పశుపతి పరాస్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు.

కాంగ్రెస్ నుంచి ఆహ్వానం వచ్చిన మాట వాస్తవమే. కానీ చేరను. బీజేపీ ప్రక్షాళన దిశగా నా ప్రయాణం సాగుతుంది. టికెట్‌ ఇవ్వనందకు బాధగా ఉన్న మాట వాస్తవమే. నన్ను అవమానించిన వారు తర్వాత పశ్చాత్తాపపడతారు. నేను నిస్సహాయుడిని కాను. రాష్ట్ర బీజేపీ కుటుంబ రాజకీయాలకు దూరంగా ఉండాలి. పార్టీ కోసం పనిచేసిన వారిని విస్మరించడం సరికాదు. రాష్ట్రంలో నియంతృత్వ ధోరణి జరగకూడద కోరుకుంటున్నా అని సదానంద గౌడ అన్నారు.

సదానంద గౌడ.. 2004 నుంచి 2019 వరకు లోక్‌సభ ఎంపీగా ఉన్నారు. ఆ తరువాత ఆగస్టు 2011 నుంచి మే 2013 వరకు కర్ణాటక ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. ఈయన మోదీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం తనకు పార్టీ టికెట్ ఇవ్వడానికి నిరాకరించడం పెద్ద చర్చకు దారి తీస్తోంది. ఈయన ఇక రాజకీయాలకు గుడ్‌బై చెబుతారా? అని పలువురు భావిస్తున్నారు.

Tags:    

Similar News