Delhi CM : తొలిరోజు జైలులో కేజ్రివాల్ .. పడిపోయిన షుగర్ లెవల్స్

Update: 2024-04-03 05:17 GMT

మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ (Arvind Kejriwal) జ్యూడీషియల్ కస్టడీలో భాగంఆ తీహార్ జైలులో (Tihar Jail) రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయన మొదటి రోజు కేవలం కొద్ది సేపు మాత్రమే నిద్రపోయినట్లు జైలు వర్గాలు తెలిపాయి. కేజీవాలు తీహార్ జైలుకు సోమవారం నాడు సాయంత్రం 4 గంలకు తీసుకు వచ్చారని వారు తెలిపారు. సెల్లోకి పంపించే ముందు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయన రక్తంలో చక్కెర స్థాయి 50 కంటే తక్కువగా ఉంది.

వైద్యుల సూచన మేరకు మెడిసిన్స్ అందించినట్లు జైలు అధికారులు తెలిపారు. జైల్లో ఆయనకు ఓ పరుపు, దుప్పట్లు, రెండు దిండ్లు సమకూర్చారు. మధ్యాహ్నం చాయ్, రాత్రి భోజనం ఇంటి నుంచి తెచ్చిన ఆహారాన్ని అందించారు. రాత్రి కొద్ది సేపు నేలపైనే పడుకున్నారని, అర్ధరాత్రి వరకూ సెల్లో అటూ ఇటూ తిరుగుతూ కని పించారని జైలు అధికారులు తెలిపారు.

మంగళవారం ఉదయం తన సెల్లో ధ్యా నం చేసిన కేజీవాల్ అనంతరం చాయ్, రెండు బిస్కట్లు అందించారు. ఆయనకు మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించారు. షుగర్ లెవల్స్ తక్కువగా ఉన్నాయని, ప్రస్తుతం ఆయన జైలు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. మధ్యాహ్నం, రాత్రి భోజనం ఇంటి నుంచి తెచ్చిన ఆహారాన్ని అనుమతిస్తామని, రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణ స్థితికి వచ్చే వరకు కొనసాగిస్తామని చెప్పారు.

ఆయన సెల్ బయట జైలు వార్డర్ తో పాటు ఇద్దరు భద్రతా సిబ్బందిని నియమిం చారు. అత్యవసర సేవల సిబ్బందిని సెల్ సమీపంలో సిద్ధంగా ఉంచారు. సీసీ కెమెరాల ద్వారా ఆయన్ను ఎప్పటికప్పుడు జైలు అధికారులు గమనిస్తున్నారు.

Tags:    

Similar News