Byju Raveendran : బైజూ వ్యవస్థాపకుడు రవీంద్రన్‌కు ఈడీ లుక్ అవుట్ నోటీసు

Update: 2024-02-22 09:38 GMT

ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (ఫెమా) ఉల్లంఘనలపై సంక్షోభంలో ఉన్న ఎడ్‌టెక్ కంపెనీ బైజూ వ్యవస్థాపకుడు, సీఈఓ బైజు రవీంద్రన్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేసింది. లుకౌట్ నోటీసులతో పాటు దేశం విడిచి వెళ్లకుండా రవీంద్రన్‌పై ప్రయాణ ఆంక్షలు విధించింది

ఫిబ్రవరి 23న జరిగే బైజు EGMపై స్టే ఇచ్చేందుకు కర్ణాటక హైకోర్టు నిరాకరించింది.

ఈ కేసులో మరో పరిణామంలో, రవీంద్రన్, అతని కుటుంబ సభ్యులను ఎడ్‌టెక్ సంస్థ నాయకత్వం నుండి తొలగించేందుకు బైజూస్ యజమాని థింక్ అండ్ లెర్న్ ప్రైవేట్ లిమిటెడ్ ఎంపిక చేసిన పెట్టుబడిదారులు ఏర్పాటు చేసిన అత్యవసర వాటాదారుల సమావేశాన్ని నిలిపివేయడానికి కర్ణాటక హైకోర్టు ఫిబ్రవరి 21న నిరాకరించింది. ఈ క్రమంలోనే ఈజీఎంపై స్టే విధించాలని బైజూస్ హైకోర్టును ఆశ్రయించింది.

అయితే ఈజీఎంలో ఆమోదించిన ఏ తీర్మానాన్ని తదుపరి కోర్టు విచారణకు ముందు అమలు చేయడం సాధ్యం కాదని కోర్టు మధ్యంతర ఉపశమనం మాత్రమే ఇచ్చింది. "అసాధారణ సాధారణ సమావేశం (EGM) సమావేశానికి సంబంధించిన షరతులు పాటించబడలేదని, కంపెనీల చట్టం 2013లోని సెక్షన్ 100 (3) ప్రకారం ఎటువంటి నోటీసు జారీ చేయబడలేదని సమర్పించబడింది" అని కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.

Tags:    

Similar News