బైజూస్ తన నాయకత్వ నిర్మాణంలో మార్పులను ప్రకటిస్తూ ఇటీవలి కాలంలో వార్తల్లో నిలుస్తోంది. ఈ క్రమంలోనే ఆ కంపెనీ సీఈవో అర్జున్ మోహన్ తన పదవి నుండి వైదొలిగారు. బైజు రవీంద్రన్ సంస్థ రోజువారీ కార్యకలాపాలను పర్యవేక్షించడంలో తన బాధ్యతలను తిరిగి ప్రారంభించనున్నారు. అయితే మోహన్ కంపెనీ వెలుపల సలహాదారు పాత్రకు మారనున్నారు.
"ఈ పునర్వ్యవస్థీకరణ BYJU'S 3.0 ప్రారంభాన్ని సూచిస్తుంది. ముఖ్యంగా హైపర్-పర్సనలైజ్డ్ ఎడ్యుకేషన్ రంగంలో అభివృద్ధి చెందుతున్న మార్కెట్ డైనమిక్స్కు త్వరగా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్న మరింత చురుకైన సంస్థ" అని వ్యవస్థాపకుడు, గ్రూప్ CEO బైజు రవీంద్రన్ అన్నారు. "మూడు ప్రత్యేక వ్యాపార యూనిట్లతో మా ప్రధాన బలాలపై దృష్టి పెట్టడం ద్వారా, లాభదాయకతపై దృష్టి సారిస్తూనే మేము కొత్త వృద్ధి అవకాశాలను అన్లాక్ చేస్తాము" అని ఆయన చెప్పారు.
రవీంద్రన్ సవాలు సమయంలో మోహన్ నాయకత్వాన్ని ప్రశంసించారు. అతని సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. "అర్జున్ ఒక సవాళ్లతో కూడిన కాలంలో బైజూస్ ను నడిపించడంలో అత్యుత్తంగా పని చేసారు. మేము అతని నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వ్యూహాత్మక సలహాదారుగా అతని నిరంతర సహకారాల కోసం ఎదురు చూస్తున్నాము" అని రవీంద్రన్ అన్నారు.