Encounter : కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు టెర్రరిస్టుల హతం

Update: 2024-05-08 05:28 GMT

జమ్మూకశ్మీర్‌ కుల్గాం జిల్లాలో మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఎన్‌కౌంటర్‌లో లష్కర్‌ గ్రూపుకు సంబంధించిన ‘ది రెసిస్టెంట్స్‌ ఫ్రంట్‌(టీఆర్‌ఎఫ్‌)’ సంస్ధకు చెందిన కీలక ఉగ్రవాది బసిత్‌దార్‌ మృతిచెందాడు. కుల్గాం రెడ్వాణీ ప్రాంతంలో ఉగ్రవాదుల కదలికల గురించి సమాచారం అందడంతో భద్రతా బలగాలు సోమవారం అక్కడ సెర్చ్‌ ఆపరేషన్‌ చేపట్టాయి.

మంగళవారం వరకు కొనసాగిన ఈ ఆపరేషన్‌ చివరకు ఎన్‌కౌంటర్‌కు దారి తీసింది. పలువురు పోలీసుల్ని చంపిన నేరాల్లో నిందితుడిగా ఉన్న బసిత్‌దార్‌పై 18 కేసులున్నాయి. అతనిపై 10 లక్షల రివార్డు కూడా ఉంది. కాగా, పలు అంశాల ఆధారంగా టెర్రరిస్టులను ఎ, ఎ ప్లస్‌, బీ, సీ కేటగిరిలుగా జమ్మూకశ్మీర్‌ పోలీసులు విభజించారు. ఆ ప్రకారం బసిత్‌దార్‌ ‘ఎ’ కేటగిరికి చెందినవాడు.

Tags:    

Similar News