రాహుల్ గాంధీ ( Rahul Gandhi ) ఖాళీ చేసిన వయనాడ్ ఎంపీ స్థానం నుంచి ఆయన సోదరి ప్రియాంకా గాంధీ ( Priyanka Gandhi ) పోటీ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నికలో ఆమె గెలిస్తే తొలిసారిగా పార్లమెంటులో అడుగుపెట్టనున్నారు. అంతేకాక గాంధీ కుటుంబంలో దక్షిణాది నుంచి గెలిచిన మూడో వ్యక్తిగా చరిత్రకెక్కుతారు. దీంతో పాటు పార్లమెంటులో తొలిసారిగా సోనియా, రాహుల్, ప్రియాంక ఒకేసారి సభ్యులుగా ఉండనున్నారు.
మరోవైపు ప్రియాంక వాద్రా వాయనాడ్ నుంచి పోటీ చేసి గెలవడం నల్లేరు మీద నడకే అంటున్నారు రాజకీయ పార్టీ విశ్లేషకులు. ఒకవేళ ప్రియాంక వాద్రా గెలిచి పార్లమెంటులో అడుగుపెడితే.. ఒకే లోక్ సభ నియోజకవర్గం నుంచి గెలిచిన అన్నా చెల్లెల్లుగా రికార్డు క్రియేట్ చేయడం ఖాయం అంటున్నారు.
2019లో ప్రత్యక్ష ఎన్నికల్లోకి అడుగుపెట్టిన ప్రియాంక గాంధీ.. ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఎలక్షన్స్లో పాల్గొనలేదు. 2022 యూపీ అసెంబ్లీలో, 2024 లోక్సభ ఎన్నికల్లో (రాయ్బరేలీ) ఆమె పోటీ చేస్తారని వార్తలు వచ్చాయి. కానీ అవి నిజం అవ్వలేదు.