WAR: భారత సైనిక శక్తి ముందు పాకిస్థాన్ నిలవగలదా..?
భారత సైనిక పరిణామలో సగం కూడా లేని పాక్ సైన్యం.. యుద్ధం వస్తే పాక్ కు మూడినట్లే..;
పహల్గాం ఉగ్ర దాడి తమ పనేనని లష్కరే తోయిబా ప్రకటించిన వేళ భారత్-పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఉగ్ర దాడికి ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ కసిగా ఉంది. ఉగ్ర మూకల ఏరివేతకు ఒక వేళ దాయాది దేశం సహకరించకపోతే, పాకిస్తాన్పై సైనిక చర్యకు సైతం ఉపక్రమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాయాది దేశాల మధ్య ఒక వేళ యుద్ధం వస్తే.. భారత్ ను తట్టుకుని పాక్ నిలబడడం చాలా కష్టమని రక్షణ రంగ నిపుణులు చెప్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా సైనిక బలాన్ని ర్యాంక్ చేసే ప్రసిద్ధ సంస్థ అయిన గ్లోబల్ ఫైర్పవర్ ప్రకారం.. 14 లక్షల మంది యాక్టివ్ సైనికులు ఉన్నారు. భారత్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద సైన్యం. ఒక వేళ యుద్ధం వచ్చి ఇరు దేశాలు తలపడితే, పాకిస్తాన్ సైన్యం... భారతదేశానికి వ్యతిరేకంగా ఎన్నో రోజులు నిలబడలేదన్నది సుస్పష్టం. పాకిస్తాన్ సైన్యం భారత్ సైనిక పరిమాణంలో సగం కంటే తక్కువ. భారత రక్షణ రంగంలో పెద్ద పారా మిలిటరీ ఉంది.
అత్యాధునిక ఆయుధాలు..
భారత్కు 4,500 యుద్ధ ట్యాంకులు, 538 యుద్ధ విమానాలు, ఆధునిక ఆయుధాలు.. భారీ క్షిపణి వ్యవస్థ ఉంది. భారత సైన్యం కేవలం సంఖ్యల పరంగానే కాకుండా బలమైన సాంకేతికత, తయారీ, వ్యూహాత్మక స్థానాల్లో కూడా బాగా మెరుగ్గా ఉంది. సంక్షిప్తంగా చెప్పాలంటే, రెండు దేశాలకు శక్తివంతమైన సైన్యాలు ఉన్నప్పటికీ, భారతదేశ సైన్యం మూడు దళాలైన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ దళం చాలా పెద్దది మరియు అధునాతనమైనది. పూర్తి సన్నద్ధతో ఉన్న భారత సైనిక సామర్థ్యం ముందు పాకిస్తాన్ ఎంతో కాలం నిలబడలేదన్నది ఫైర్పవర్ సంస్థ అంచనా. భారత్ వద్ద 25 లక్షలకు పైగా పారామిలిటరీ దళాలు, అధునాతన యుద్ధ సామగ్రి, అర్జున్ మెయిన్ బాటిల్ ట్యాంకులు, T-90 'భీమ్' ట్యాంకులు, పినాకా మల్టీ-బారెల్ రాకెట్ లాంచర్లు, బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణులు, హోవిట్జర్లు,ఆధునిక ఫిరంగి దళాలు ఉన్నాయి.