Delhi CM : కేజ్రీవాల్, తన భార్యను కిటికీలోంచే కలమంటున్నారు : ఆప్ నేత

Update: 2024-04-13 07:58 GMT

మద్యం పాలసీ కేసులో అరెస్టయి ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు తనతో ప్రత్యక్ష సమావేశానికి అనుమతి నిరాకరించిందని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు సంజయ్ సింగ్ పేర్కొన్నారు. భార్య సునీతను కిటికీలోంచి మాత్రమే కలుసుకోవాలని చెప్పారని, ఇది అమానవీయ చర్య అని ఆయన మండిపడ్డారు.

విలేకరుల సమావేశంలో సంజయ్ సింగ్ మాట్లాడుతూ, "భయంకరమైన నేరస్థులు కూడా తమ బ్యారక్‌లలో సమావేశాలు చేసుకోవడానికి అనుమతిస్తారు" అని అన్నారు. కానీ ఢిల్లీకి మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి తన భార్యను, వ్యక్తిగత సహాయకుడిని మాత్రం కిటికీలోంచే కలుసుకునేలా చేస్తున్నారు. ఇంత అమానవీయ ప్రవర్తన ఎందుకు?" అని ప్రశ్నించాడు.

Tags:    

Similar News