ఏప్రిల్ 7న జబల్పూర్లో ప్రధాని మోదీ (PM Modi) రోడ్షో (Road Show) సందర్భంగా ఒక వేదిక కూలిపోవడంతో పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కాగా ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. అంతకుముందు, మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో ఆదివారం జరిగిన రోడ్షోలో ప్రధాని నరేంద్ర మోదీని చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు వీధుల్లోకి వచ్చారు.
రోడ్షోలో ప్రధాని మోదీతో పాటు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, జబల్పూర్ లోక్సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి ఆశిష్ దూబే, రాష్ట్ర కేబినెట్ మంత్రి రాకేష్ సింగ్ కూడా ఉన్నారు. ప్రధాని మోదీ రోడ్షో సందర్భంగా రోడ్డుకు ఇరువైపులా పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడి ఆయనకు స్వాగతం పలికారు. పీఎం మోదీ Xలో జబల్పూర్లో జరిగిన రోడ్షో "అద్భుతం" అని అభివర్ణించారు.
జబల్పూర్ లోక్సభ నియోజకవర్గం
ఇప్పుడు ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ నేతృత్వంలోని మధ్యప్రదేశ్ క్యాబినెట్లో మంత్రిగా ఉన్న రాకేష్ సింగ్, 2004, 2019 మధ్య జబల్పూర్ లోక్సభ స్థానం నుండి వరుసగా నాలుగు విజయాలు సాధించారు. అయితే, ఈసారి, బీజేపీ కొత్త ముఖాన్ని -- జబల్పూర్ నుండి ఆశిష్ దూబేని రంగంలోకి దించింది. ఆయన కాంగ్రెస్ అభ్యర్థి దినేష్ యాదవ్తో పోటీ పడనున్నారు. 2019 లోక్సభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్లోని 29 లోక్సభ స్థానాలకు గాను 28 స్థానాలను బీజేపీ గెలుచుకుంది.