Jammu and Kashmir : లోక్‌సభ ఎన్నికల్లో శ్రీనగర్ నుంచి ఒమర్ అబ్దుల్లా పోటీ

Update: 2024-04-11 09:26 GMT

జమ్మూ & కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సీ) ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా శ్రీనగర్ నియోజకవర్గం నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ఒమర్ అబ్దుల్లా శ్రీనగర్ నియోజకవర్గంలో పోటీ చేస్తారని, మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నాయకుడు చౌదరి మహ్మద్ రంజాన్ ఉత్తర కాశ్మీర్ బారాముల్లా స్థానం నుంచి పోటీ చేస్తారని ఎన్సీలోని వర్గాలు తెలిపాయి.

ఎన్సీ ఇప్పటికే తన అభ్యర్థి, సీనియర్ గుజ్జర్/బకర్వాల్ నాయకుడు, అనంత్‌నాగ్-రాజౌరీ నియోజకవర్గం నుండి మియాన్ అల్తాఫ్ అహ్మద్‌ను ప్రకటించింది. మరో మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ కూడా అనంత్‌నాగ్-రాజౌరీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు.

పిడిపి తన యువజన విభాగం అధ్యక్షుడు వహీద్ పర్రాను శ్రీనగర్‌కు, మాజీ రాజ్యసభ సభ్యుడు ఫయాజ్ అహ్మద్ మీర్‌ను బారాముల్లా స్థానం నుండి పోటీకి దింపింది. ఇకపోతే కశ్మీర్‌లోని మూడు లోక్‌సభ స్థానాలకు బీజేపీ ఇప్పటివరకు అభ్యర్థులను ప్రకటించలేదు. కతువా-ఉధంపూర్ నుంచి రాష్ట్ర మంత్రి (PMO) డాక్టర్ జితేంద్ర సింగ్, జమ్మూ-రియాసీ స్థానానికి జుగల్ కిషోర్ శర్మలను పార్టీ పోటీకి దింపింది.

Tags:    

Similar News