పాన్ కార్డు ఉన్న ప్రతి వ్యక్తి ఆదాయ పన్ను చట్టం 1961 ప్రకారం ఆధార్ తో అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ గడువు ఇప్పటికే ముగిసింది. మే 31 వరకు 1000 రూపాయల ఫైన్తో పాన్-ఆధార్ కార్డును అనుసందానం చేసుకోవచ్చు.
ఇలా అనుసంధానం చేయ కుంటే 2024 మార్చి 31కి ముందు చేసిన పన్ను లావాదేవీలపై అధిక రేటు వద్ద పన్ను కోత (టీడీఎస్), పన్ను చెల్లింపులు ఉంటాయని ఆదాయ పన్ను శాఖ తెలిపింది. టీడీఎస్, టీసీఎస్ చెల్లింపులు ఎగవేసినట్లుగా కొంత మంది పన్ను చెల్లింపుదారులు ఇప్పటికే నోటీసులు అందుకున్నారని తెలిపింది.
పాన్ -ఆధార్ కార్డు అనుసంధానం చేయకపోవడం మూలంగా పాన్ కార్డు నిరుపయోగంగా మారడమే ఇందుకు కారణమని పేర్కొంది. అధిక రేటు వద్ద పన్ను కోత, చెల్లింపు చేయ కపోవడం వల్ల నోటీస్లు అందాయని తెలిపింది. వారందరికీ మే 31 వరకు అవకాశం కల్పిస్తున్నట్లు ఆదాయ పన్ను శాఖ స్పష్టం చేసింది. ఆ లోపుగా పాన్ కార్డును ఇలాంటి వారు యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది.