పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ (Bhagawant Mann), ఆయన భార్య గురుప్రీత్ కౌర్లకు ఆడబిడ్డ పుట్టింది. మన్ గురువారం (మార్చి 28) తన అధికారిక X హ్యాండిల్లో ఈ వార్తను పంచుకున్నారు. తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని తెలియజేశారు. పాప ఫోటోను కూడా షేర్ చేశాడు. "దేవుడు ఒక కుమార్తెను బహుమతిగా ఇచ్చాడు..తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు" అని మాన్ Xలో పోస్ట్ చేశాడు.
లూథియానాలోని ఫోర్టిస్ ఆసుపత్రిలో ప్రసవం జరిగింది. దీంతో, పదవిలో ఉండగానే తండ్రయిన పంజాబ్లో పునర్వ్యవస్థీకరణ జరిగిన తొలి ముఖ్యమంత్రిగా మన్ నిలిచారు. డాక్టర్ గురుప్రీత్ కౌర్ను రెండేళ్ల క్రితం మన్ వివాహం చేసుకున్నాడు. ముఖ్యమంత్రికి మాజీ భార్యతో ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Blessed with baby Girl.. pic.twitter.com/adzmlIxEbb
— Bhagwant Mann (@BhagwantMann) March 28, 2024