గంగోత్రి ధామ్ ఆలయ పోర్టల్స్ అక్షయ తృతియ సందర్భంగా 2024 మే 10 మధ్యాహ్నం 12:25 గంటలకు ఓపెన్ అవుతాయి. ఈ విషయాన్ని ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో ఉన్న గంగోత్రి ఆలయ కమిటీ అధికారులు వెల్లడించారు. గంగా మాత శీతాకల నిడివి ప్రాంతమైన ఉత్తరకాశీలోని మూకాంబలో ఆలయ అర్చకులు కలిసి.. పోర్టల్స్ని తెరిచే విషయంపై చర్చించారని శ్రీ పంచ్ మందిర్ సమితి గంగోత్రి ధామ్కు చెందిన హరీశ్ సెమ్వాల్ తెలిపారు.
యమునోత్రి ధామ్ పోర్టల్స్ ఓపెనింగ్పై ఈ నెల 14న.. సంబంధిత ఆలయ అర్చకులు ఓ నిర్ణయం తీసుకుంటారు. 14వ తేదీ ఆదివారం చైత్ర మాసంలో వచ్చే 6వ రోజు కావడం.. యమున.. భూమిపైకి వచ్చిందని నమ్ముతుండటం వల్లే.. ఆ రోజు అర్చకులు చర్చలు జరుపుతారని యమునోత్రి ఆలయ కమిటి ఎగ్జిక్యూటివ్ సభ్యుడు పురుషోత్తమ్ యూనియల్ అన్నారు. బద్రినాథ్ ధామ్ పోర్టల్.. మే 12 ఉదయం 6 గంటలకు ఓపెన్ చేస్తారు. కేదార్నాథ్ పోర్టల్.. మే 10 ఉదయం 7 గంటలకు ఓపెన్ అవుతుందని ఆలయ అధికారులు తెలిపారు.
సముద్రానికి 3140 మీటర్ల ఎత్తులో ఉంటుంది గంగోత్రి ధామ్, సముద్రానికి 3,293 మీటర్ల ఎత్తులో యమునోత్రి ఉంటాయి. యేటా 6 నెలలపాటు ఛార్దామ్ ఆలయాలు మూతపడి ఉంటాయి. ఏప్రిల్ లేదా మేలో తెరుచుకుని అక్టోబర్ లేదా నవంబర్ చలికాలంలో మూతపడతాయి. ఛార్దామ్ యాత్రకు గతేడాది రికార్డ్ స్థాయిలో 56లక్షల మంది భక్తులు సందర్శించుకున్నారు.