Inspired by Ramayana : తన చర్మంతో తల్లి చెప్పులు చేయించిన కొడుకు

Update: 2024-03-21 09:31 GMT

మధ్యప్రదేశ్‌లోని (Madhya Pradesh) ఉజ్జయినిలో (Ujjain) ఒకప్పుడు హిస్టరీ-షీటర్‌గా ఉన్న ఒక వ్యక్తి, రామాయణ బోధలచే స్ఫూర్తి పొందడంతో భారీ మార్పు పొందాడు. రౌనక్ గుర్జార్ ఒకప్పుడు పోలీసుల చేతిలో కాల్చబడ్డాడు. ఈ క్రమంలోనే తన తొడ చర్మంలో కొంత భాగాన్ని ఉపయోగించి పాదరక్షలను తయారు చేసి తన తల్లికి బహుమతిగా ఇచ్చాడు. శ్రీరాముడు తన తల్లి పట్ల చూపిన భక్తి కథతో తాను స్ఫూర్తి పొందానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

"నేను క్రమం తప్పకుండా రామాయణం పారాయణం చేస్తాను. రాముడి పాత్ర నన్ను తీవ్రంగా ప్రభావితం చేసింది" అని రౌనక్ పంచుకున్నారు. "తన చర్మంతో చెప్పులు తయారు చేయడం కూడా తల్లికి సరిపోదని రాముడు స్వయంగా చెప్పాడు. కాబట్టి, ఈ ఆలోచన నా మదిలో వచ్చింది. నా చర్మంతో పాదరక్షలు తయారు చేసి వాటిని మా అమ్మకు బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాను" అని రౌనక్ చెప్పారు.

అతను తన కుటుంబంలో ఎవరికీ సమాచారం ఇవ్వకుండా ఆసుపత్రిలో శస్త్రచికిత్స ద్వారా అతని చర్మాన్ని తొలగించాడు. ఆపై దాన్ని పాదరక్షలు తయారు చేసే ఒక చెప్పులు కుట్టే వ్యక్తి వద్దకు తీసుకెళ్లాడు. మార్చి 14, 21 మధ్య తన ఇంటి దగ్గర ఏర్పాటు చేసిన భగవత్ కథలో రౌనక్ తన తల్లికి చెప్పులు సమర్పించాడు.

Tags:    

Similar News