Tamil Nadu : షుగర్ పేషెంట్లలో తమిళనాడు టాప్

Update: 2024-12-12 07:15 GMT

దేశంలో అత్యధిక మంది షుగర్ పేషెంట్లు తమిళనాడులో ఉన్నారని కేంద్రం తెలిపింది. అక్కడ 80.90 లక్షల మంది వ్యాధిబారిన పడినట్లు పేర్కొంది. ఈ జాబితాలో తెలంగాణ 4వ ప్లేస్‌లో ఉంది. రాష్ట్రంలో 24.52 లక్షల మంది డయాబెటిక్ బాధితులున్నారు. రెండో స్థానంలో మహారాష్ట్రలో (39.81 లక్షలు), మూడో ప్లేస్‌లో కర్ణాటక(28.74 లక్షలు) నిలిచాయి. ఇక ఏపీలో 20.92 లక్షల మంది షుగర్ పేషెంట్లు ఉన్నారు. అత్యల్పంగా ఢిల్లీలో 1,108 మంది బాధితులే ఉండటం గమనార్హం. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 3.13 కోట్ల మంది షుగర్​కు చికిత్స తీసుకుంటున్నారని తెలిపింది. 

Tags:    

Similar News