Adilabad: ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురి మృతి

Update: 2023-07-08 07:30 GMT

ఆదిలాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుడిహత్నూర్‌ మండలం మేకలగండి వద్ద జాతీయ రహదారిపై ఆటోను గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డవారిని రిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. మృతులంతా ఆదిలాబాద్‌లోని రవీంద్రనగర్‌ కాలనీవాసులుగా గుర్తించారు.

Tags:    

Similar News