ఏపీలో వాలంటీర్ల ఆగడాలు శృతిమించుతున్నాయి. అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం జోగుంపేటకు చెందిన శివప్రసాద్ అనే వాలంటీర్ ఒంటరి మహిళలను టార్గెట్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ మహిళను గర్భవతి చేశాడు. మూడేళ్లగా తన అవసరం తీర్చుకుని, ఇప్పుడు ముఖం చాటేస్తున్నాడని, అతనిపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని కోరుతూ బాధిత మహిళ గొలుగొండ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇప్పటి వరకు FIR కూడా నమోదు చేయలేదు.