సార్వత్రిక ఎన్నికలే టార్గెట్గా కమలదళం వ్యూహాలకు పదును పెడుతోంది.పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా సంస్థాగత మార్పులకు శ్రీకారం చుట్టింది. ఏపీ, తెలంగాణతో పాటు పంజాబ్, జార్ఖండ్ అధ్యక్షులను మార్చింది. ఏపీలో సోము వీర్రాజు, తెలంగాణలో బండి సంజయ్ను తప్పించింది.వారి స్థానంలో పురందేశ్వరి, కిషన్రెడ్డిని అధ్యక్షులుగా నియమించింది. ఇవాళ బీజేపీ పెద్దలతో పురందేశ్వరి, కిషన్రెడ్డి భేటీ కానున్నారు. త్వరలో జరగనున్న 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు కేంద్రంలో హ్యాట్రిక్ విక్టరీ లక్ష్యంగా బీజేపీ అగ్రనాయకత్వం పావులు కదుపుతోంది.