అమెరికా పర్యటనలో భాగంగా తమిళనాడు సీఎం స్టాలిన్, ఆయన సతీమణి దుర్గ, అధికారులు దుబాయ్ వెళ్తున్న విమానానికి బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. అప్పటికే స్టాలిన్ ప్రయాణిస్తున్న విమానం చాలా దూరం వెళ్లింది. దీంతో ఆ విమానం దుబాయ్ చేరుకునేంత వరకు ఎయిర్పోర్టు ఉన్నతాధికారులు తీవ్ర ఆందోళన చెందారు. దుబాయ్లో ఆ విమానం ల్యాండ్ అయ్యాక బాంబ్స్క్వాడ్ క్షుణ్ణంగా తనిఖీ చేసి బాంబులు లేవని నిర్ధరించారు.