బీజేపీతో బీఆర్ఎస్ పొత్తుకు సిద్ధమవుతోందంటూ తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్రావు థాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. పాట్నాలో విపక్షాల మీటింగ్ జరుగుతున్న సమయంలోనే.. బీజేపీ మంత్రుల్ని కేటీఆర్ కలవడం వెనుక ఆంతర్యమేంటని ప్రశ్నించారు. కేసీఆర్ అడుగులు బీజేపీ వైపు పడుతున్నాయన్నారు. లిక్కర్ కేసులో కవితకు ఈడీ నోటీసులు ఇచ్చినా ఇప్పటి వరకు ఈడీ అరెస్ట్ చేయలేదన్నారు. పలువురు బీఆర్ఎస్, బీజేపీ నేతలు కాంగ్రెస్తో టచ్లో ఉన్నారని చెప్పారు.