కేంద్ర హోంమంత్రి అమిత్షాతో భేటీ అయ్యేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నేడు ఢిల్లీ వెళ్తున్నారు. ఆ సమావేశంలో పొత్తుపై చర్చలు కొలిక్కి వచ్చే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. బీజేపీతో పొత్తుకు సంబంధించి చంద్రబాబు కొన్ని రోజుల క్రితం అమిత్షాతో భేటీ అయ్యారు. దానికి కొనసాగింపుగా ఇప్పుడు మరోసారి కలవబోతున్నారు. మరోపక్క బుధవారం ఉదయం చంద్రబాబును ఉండవల్లిలోని ఆయన నివాసంలో పవన్కల్యాణ్ కలిశారు. ఇరుపార్టీల అభ్యర్థుల రెండో జాబితాతో పాటు, బీజేపీతో పొత్తు అంశంపై గంటన్నరపాటు ఇద్దరూ చర్చించారు.