జగన్ దొంగ ఓట్లతో గెలవాలని చూస్తున్నారని అన్నారు మాజీమంత్రి బండారు సత్యనారాయణ మూర్తి. రాష్ట్రంలో ఎక్కువ మంది వాలంటీర్లు వైసీపీ వారేనని ఆరోపించారు. సబ్బవరం ఓట్ల సర్వేలో ముగ్గురు వాలంటీర్లు పాల్గొన్నారన్న బండారు. ఈ అంశంపై ఎమ్మార్వోపై విశాఖ ఆర్డీవోకు ఫిర్యాదు చేశామని తెలిపారు. ఓట్ల సర్వే అంశంపై కేంద్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తామని అన్నారు.