బీఆర్‌ఎస్‌-బీజేపీ నేతల పోటాపోటీ నినాదాలు

Update: 2023-06-22 09:45 GMT

బీఆర్‌ఎస్‌-బీజేపీ నేతల పోటాపోటీ నినాదాలతో హైదరాబాద్‌ గన్‌ పార్క్‌ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెలంగాణ అమరులకు నివాళి అర్పించేందుకు వచ్చిన బీఆర్ఎస్.. బీజేపీ నేతల మధ్య తోపులాట జరిగింది. బీజేపీ కార్పొరేటర్ల వద్ద ఉన్న ప్లకార్డులను బీఆర్‌ఎస్‌ నేతలు చించేశారు. దీనికి నిరసనగా గన్‌ పార్క్‌ వద్ద బీజేపీ కార్పొరేటర్లు బైఠాయించారు. పోటాపోటీ నినాదాలతో గన్‌ పార్క్‌ దద్దరిల్లింది. 

Tags:    

Similar News