జగన్ సర్కారుపై మండిపడ్డ మద్దిపాటి వెంకటరాజు

Update: 2023-08-13 07:30 GMT

జగన్ సర్కారు... వర్షాకాలంలోనూ రైతులకు సాగునీరు అందించలేని అసమర్ధ ప్రభుత్వమంటూ మండిపడ్డారు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, గోపాలపురం నియోజకవర్గ ఇన్‌చార్జ్ మద్దిపాటి వెంకటరాజు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం పోతవరం, ఆనుముని లంక ,సుభద్ర పాలెం తదితర గ్రామాల్లోని పోలాలను టీడీపీ నేతలతో కలసి పరిశీలించారు. తాడిపూడి లిఫ్ట్ పరిధిలో సాగునీరు విడుదల చేయకపోవడంతో 300 ఎకరాల్లో ఎండిపోవడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులతో కలిసి నినాదాలు చేశారు. తక్షణమే రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు, లేదంటే రైతులతో కలిసి ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

Tags:    

Similar News