AP: ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్‌ వన్‌ వాయిదా

Update: 2024-08-22 02:30 GMT

ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను ఏపీపీఎస్సీ వాయిదా వేసింది. తొలుత నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం.. సెప్టెంబర్ 2 నుంచి 9 వరకు జరగాల్సిన ఈ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. అభ్యర్థుల నుంచి వచ్చిన వినతుల మేరకు వాయిదా చేసినట్టు తెలిపింది. తదుపరి షెడ్యూల్ త్వరలోనే ప్రకటిస్తామని ఏపీపీఎస్సీ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌లో 81 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి మార్చి 17న ప్రిలిమ్స్‌ పరీక్ష జరిగిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలో మొత్తం 1,48, 881 మంది ఈ పరీక్షకు దరఖాస్తులు చేసుకున్నారు. అందులో 4,496 మంది మాత్రమే మెయిన్స్‌కు అర్హత సాధించారు.

Tags:    

Similar News